గుడ్ న్యూస్.. ఐఫోన్ల రేట్ల‌ను తగ్గించిన యాపిల్‌..

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తాజాగా ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌లయ్యాయి. త్వ‌ర‌లోనే ఆ ఫోన్లు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి. అయితే కొత్త ఐఫోన్ల విడుద‌ల నేప‌థ్యంలో యాపిల్ పాత ఐఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ప్ర‌స్తుతం యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో తగ్గించిన ధ‌ర‌ల‌కు పాత ఐఫోన్ల‌ను వినియోగదారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

apple slashed old iphone rates

ఐఫోన్ 12 ఫోన్ల విడుద‌ల కార‌ణంగా యాపిల్ త‌న ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఐఫోన్ 11 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.

* ఐఫోన్ ఎస్ఈ 2020 64జీబీ పాత ధ‌ర రూ.42,500 ఉండగా, కొత్త ధ‌ర రూ.39,900గా ఉంది.
* ఐఫోన్ ఎస్ఈ 2020 128జీబీ పాత ధ‌ర రూ.47,800. కొత్త ధ‌ర రూ.44,900.
* ఐఫోన్ ఎస్ఈ 2020 256జీబీ పాత ధ‌ర రూ.58,300, కొత్త ధ‌ర రూ.54,900.

* ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ పాత ధ‌ర రూ.52,500, కొత్త ధ‌ర రూ.47,900.
* ఐఫోన్ ఎక్స్ఆర్ 128జీబీ పాత ధ‌ర రూ.57,800, కొత్త ధ‌ర రూ.52,900.

* ఐఫోన్ 11 64జీబీ పాత ధ‌ర రూ.68,300, కొత్త ధ‌ర రూ.54,900.
* ఐఫోన్ 11 128జీబీ పాత ధ‌ర రూ.73,600, కొత్త ధ‌ర రూ.59,900.
* ఐఫోన్ 11 256జీబీ పాత ధ‌ర రూ.84,100, కొత్త ధ‌ర రూ.69,900.

Read more RELATED
Recommended to you

Latest news