‌ఆర్టీసీలో వచ్చే ఆదాయం డీజిల్ ఖర్చుకే సరిపోతుంది..!

-

‌ఆర్టీసీలో వచ్చే ఆదాయం డీజిల్ ఖర్చుకే సరిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్ వ్యాప్తి నివారణపై జిల్లాల ఆర్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మే 21 నుంచి 30% బస్సులే నడుస్తున్నాయని తెలిపారు. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలి. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలి.

కరోనా సోకకుండా జాగ్రత్త పడాలని, సరకు రవాణాతో ఆదాయం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల అన్నిరంగాలపై ప్రభావం తీవ్రంగా పడింది. ప్రజారవాణా నేటికీ వైరస్ ప్రభావం నుంచి కోలుకోలేని పరిస్థితి. అందులో భాగంగానే ఏపీఎస్ ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది.

Read more RELATED
Recommended to you

Latest news