పెళ్లిపీటలెక్కుతున్న అరకు వైసీపీ ఎంపీ..

-

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరుగనుంది. మాధవికి గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ తో నిశ్చితార్థం జరిగిందని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన వైసీపీ అరకు ఎంపీ మాధ‌వి పెళ్లిపీట‌లెక్క‌బోతుంది. తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ సీనియర్ ను ఓడించి రికార్డు స్థాపించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైసీపీ ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధవి స్వగృహంలో ఇటీవ‌ల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.

ఇక ఈ నెల 17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆపై విశాఖపట్నంలో రిసెప్షన్‌ ఉంటుందని వారు తెలిపారు. ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news