రోజూ మీరు ఈ ఆహారాలు ఆరోగ్యమైనవి అనే తింటున్నారు కదా..? కానీ ఇవి ప్రాణాంతకం..

-

మనం కొన్ని ఆహారాలను తెలిసి తెలియక తినేస్తుంటాం.. కానీ కొన్ని. కడుపునింపుతాయి కానీ అదే సమయంలో మనకు హాని కలిగిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు. అవేంటో చూద్దామా..!

పచ్చి బంగాళాదుంప
కూర, వేపుడు, కుర్మా ఎలా చేసుకున్నా బంగాళా దుంపలు కూర రుచిగానే ఉంటుంది. ఇందులో సోలనేసి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది న్యూరో టాక్సిక్. మానవ శరీరానికి చాలా విషపూరితమైనది. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ సమ్మేళనం ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, వాంతులు, వికారం, అంతర్గత రక్తస్రావం, కోమాలో వెళ్ళడం, ఒక్కోసారి మరణానికి కారణమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. 450 గ్రాముల ఆకుపచ్చ బంగాళాదుంపలు తింటే మరణం తప్పదట..

జాజికాయ
మిరిస్టిసిన్ అనే క్రియాశీల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో విచ్చిన్నమైనప్పుడు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తలనొప్పి, మైకం వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. తేలింది ఏంటంటే.. 37 ఏళ్ల మహిళ ఒకసారి 10 గ్రాముల జాజికాయని తీసుకుంది. అది తిన్న గంటన్నరలోనే ఆమెలో తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. బిర్యానీలో తప్పనిసరిగా జాజికాయ వేస్తారు. కానీ దాన్ని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వేసుకుంటారు.

బ్రౌన్ రైస్

ఏంటి ఇది కూడా మంచిది కాదా అనుకుంటున్నారు..? మధుమేహులకు షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే బ్రౌన్ రైస్ ఉత్తమ ఎంపిక. సాధారణంగా బియ్యం కడిగేటప్పుడు ఒకటి రెండు గింజలు అయినా నోట్లో వేసుకుంటారు. అలాగే వీటిని కూడా వేసుకుంటున్నారా అవి ఎంత ప్రమాదమో తెలుసా? తెల్ల బియ్యంతో పోల్చినప్పుడు బ్రౌన్ రైస్‌లో విషపూరిత సమ్మేళనం ఎక్కువ. ఇది నాడీ వ్యవస్థకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాదు బ్రౌన్ రైస్‌ని 4-8 సార్లు కడగాలి. వండటానికి ముందు బియ్యాన్ని 30-40 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడే వాటిని తినాలి.. అలా తింటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారు.

చేదు బాదం
హైడ్రోజన్ సైనైడ్ అనే విష సమ్మేళనం కలిగి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. 20-25 చేదు బాదం పప్పులు తిన్నారంటే ప్రాణం పోవచ్చు.. మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎందుకు ఉంటుందంటే.. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది.

రెడ్ కిడ్నీ బీన్స్
వండని లేదా ఉడకని కిడ్నీ బీన్స్‌లో లెక్టిన్ ఉంటుంది. ఇవి తింటే పొత్తికడుపు నొప్పి, వికారం, మరణం కూడా సంభవించవచ్చు. వండిన కిడ్నీ బీన్స్‌లో లెక్టిన్ ఉండదు. ఒకవేళ తక్కువగా ఉడకబెట్టినట్లయితే లెక్టిన్ స్థాయి 5 రెట్లు పెరుగుతుంది. వాటిని తినడం వల్ల తీవ్రమైన విషం శరీరంలో చేరుతుంది. బీన్స్ వండటానికి ముందు కనీసం 2 గంటలు నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news