భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్ల అరెస్ట్

-

భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు.ఇద్దరు చైన్ స్నాచర్లు విశాంత్, రాహుల్ ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.గుల్బర్గా నుండి బైక్ పై ఈనెల 22 న చైన్ స్నాచర్స్ నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు.ఈనెల 22 న కొండాపూర్, మూసాపేట్,, ఆర్సిపురం లో ముగ్గురు మహిళల చైన్ లు స్నాచింగ్ చేసినట్టు తెలిపారు.ఈనెల 25న ఇద్దరు బైకుపై మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీలో మహిళ గొలుసు నిందితులు లాక్కెళ్ళినట్లు గుర్తించారు.

ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నించారు కానీ.. కుదరకపోవడంతో అక్కడి నుండి నిందితులు పరారయ్యారు.చైన్స్ స్నాచర్ల కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు అన్ని వాహనాలను తనిఖీలు చేసారు పోలీసులు.పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు చైన్ స్నాచర్లు. దీంతో చాకచక్యంగా ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసారు రామచంద్రపురం పోలీసులు. మధ్యాహ్నం 1 గంటకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news