Breaking: అస్తికలు కలపడానికి వెళ్లి అనంతలోకానికి.. 5గురు స్పాట్‌డెడ్..!!

-

హర్యానాలోని రేవరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై మంగళవారం వేగంగా వెళ్తున్న క్రూజర్.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మృతి చెందినట్లు బావల్ కలెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.

road-accident

జైపూర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో అతని కుటుంబం అస్తికలు గంగానదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అస్తికలు కలిపి తిరుగు ప్రయాణం అవుతుండగా.. రేవరిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను మార్చురీకి తరలించారు. కాగా, క్రూజర్‌లో 17 మంది ప్రయాణిస్తున్నట్లు, ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version