NTR సినిమాతో పూర్తిగా నష్టపోయా.. మానసిక క్షోభను అనుభవించా.. అశ్వినీ దత్..!!

-

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా చలామణి అవుతున్న అశ్వినీ దత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలను తెరకెక్కించి.. అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈయన మాత్రమే కాదు ఈయన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్ ఇద్దరూ కూడా నిర్మాతలుగా రాణిస్తూ ఉండడం గమనార్హం.. నిజం చెప్పాలి అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టిన కూతుర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ అమ్మాయిలు. నిజానికి గతంలో ఒక జ్యోతిష్యుడుని చాలా గొప్పగా నమ్మేవారు అశ్విని దత్.. ఇక ఆయన చెప్పినా సరే ఎన్టీఆర్ సినిమా విషయంలో వినకపోవడంతో పూర్తిగా నష్టపోవడమే కాకుండా మరెన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా తన కూతురు స్వప్న దత్ తో కలిసి దుల్కర్ సల్మాన్ హీరోగా , మృణాల్ ఠాకూర్ హీరోయిన్ తెరకెక్కిన సీతారామం సినిమాకు నిర్మాతగా పనిచేశారు. ఇక ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను పురస్కరించుకొని అశ్వినీ దత్ తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి హాజరయ్యారు. ఇక ఈ ప్రోగ్రాం లో భాగంగానే ఎన్నో విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ విషయంలో పూర్తిగా నష్టపోయానని కూడా తెలిపాడు. శక్తి సినిమాకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వీ ఎఫ్ ఎక్స్ తో చాలా అద్భుతంగా తెరకెక్కించామని, కానీ పూర్తిస్థాయిలో నష్టపోయానని తెలిపిన ఆయన ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో పూర్తిగా మానసిక క్షోభను అనుభవించాను అంటూ వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నో ఆస్తులను కూడా శక్తి సినిమాతో పోగొట్టుకున్నానని తెలిపారు.Sakthi (2011) - IMDb

అయితే ఇవన్నీ తన సన్నిహితుడు ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన వినలేదని ఆ తర్వాత రియలైజ్ అయ్యానని ఇక క్రమక్రమంగా మంచి కథలను ఎంపిక చేసుకొని సినిమాలను తెరకెక్కించాము .ఆ తర్వాత క్రమంగా నిలదొక్కుకోగలిగాను అంటూ అశ్వినీ దత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news