“హై వోల్టేజ్” మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా …!

-

ఈ రోజు ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా దాయాదులు అయిన పాకిస్తాన్ మరియు ఇండియా ల మధ్యన హోరాహోరీగా మ్యాచ్ జరగనుంది. మూడు గంటలకు స్టార్ట్ కానున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఈరోజు వర్షం కురిసే అవకాశాలు ఉండడంతో ఒక ప్లాన్ ప్రకారం ముందుగా బౌలింగ్ తీసుకుంటే మంచిదని క్రికెట్ విక్షేషకులు అభిప్రాయపడుతుంటే, అందుకు పూర్తి విరుద్ధంగా రోహిత్ బ్యాటింగ్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు ఇది చాలా ప్రతిష్ఠతో కూడిన మ్యాచ్ అని చెప్పాలి.

ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే పాకిస్తాన్ తో మనకున్న రికార్డ్ ఇంకా మెరుగవుతుంది. మరి పాకిస్తాన్ ముందు ఎంత టార్గెట్ ను నిలుపుతారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news