ఆసియా కప్ 2023: “యోయో” టెస్ట్ లో విరాట్ , రోహిత్, పాండ్య లు పాస్… !

-

ఆగస్ట్ 30వ తేదీ నుండి శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికగా ఆసియా కప్ 2023 జరగనుంది. ఇప్పటికే రెండు దేశాలలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ ఆసియా కప్ లో పాల్గొనే ఇండియా జట్టును సైతం ఈ మధ్యనే అజిత్ అగార్కర్ సారధ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక ఇండియా జట్టు ఆగష్టు 30వ తేదీన శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది. అందులో భాగంగా ఇండియా జట్టులోని 17 మంది ప్లేయర్లు ఆలూర్ లోని శిక్షణా శిబిరంలో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన యోయో టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యాలు పాస్ అయ్యారు. ఇక జట్టులో ఉన్న మిగిలిన ప్లేయర్ లు కూడా యోయో టెస్ట్ లో పాల్గొనగా ఇంకా రిజల్ట్స్ తెలియాల్సి ఉంది. ఇక ఆసియా కప్ లో ఇండియా తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది.

ఇక దాయాదుల పోరు ఎంత హోరాహోరీగా ఉంటుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ మరియు కే ఎల్ రాహుల్ లు జట్టులోకి తీసుకుంటున్నందున చాలా కాలం అఞ్ఞతరం ఏ విధంగా ఆడుతారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news