ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం, 180 మందికి గాయాలు

-

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా జరిగిన ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ లో తీవ్ర విషాదమే జరిగింది. వినోదం కోసం జరిగిన మ్యాచ్‌ లో మారణకాండ చోటు చేసుకోవడంతో.. ఏకంగా 127 మంది దుర్మణం చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అరెమా – పెర్సెబయా మధ్య ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌ సందర్భంగా వివాదం జరుగడంతో.. ఇరు జట్ల ఫ్యాన్స్‌ ఒక్క సారిగా స్టేడియంలోకి దూసుకెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పరిస్థితి మరింత అదుపు తప్పటంతో.. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఒక్కసారిగా ఫ్యాన్స్‌ పరుగులు తీయడంతో.. తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు టియర్‌ గ్యాస్‌ కారణంగా గాలిలో ఆక్సిజన్‌ అందక ఏకంగా 127 మంది మరణించారు. మరో 180 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news