ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. చెరువులో పడి వ్యక్తి దుర్మరణం!

-

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి చెరువులో శవమై తేలాడు. ఈ ఘటన చింతలమానేపల్లి మండలం కేంద్రంలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ నరేష్ కథనం ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ చెరువులో మతిస్థిమితం లేని వ్యక్తి కొంపరి కిరణ్ (28) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Suspicious death of a 5th class student in the hostel of Gurukula School

శనివారం రాత్రి 10 గంటల సమయంలో మతిస్థిమితం లేని కిరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రంతా ఇంటికి రాలేదు.ఇంట్లో వాళ్లు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, సోమవారం ఉదయం మండల కేంద్రంలోని పోచమ్మ చెరువులో కిరణ్ శవమై తేలాడు. దీంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. వైద్యుల సాయంతో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు.మృతుని తండ్రి కొంపరి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news