ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం.. మద్యం మత్తులో వృద్ధుడిపై దాడి

-

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొండూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మర్చిపోయి, వృద్ధుడని కూడా చూడకుండా.. సొంత బావ అనే విషయం మరిచి, మద్యం మత్తులో బావమరిది అయిన పేరయ్య(60),గత రాత్రి చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో కర్ర తీసుకొని బావ పై దాడి చేస్తూ, కాలుతో తంతు, మెడపై కాలు వేసి తొక్కుతూ విచక్షణ రహితంగా దాడి చేశాడు.

ఈ క్రమంలో వృద్ధుడు అయిన శీలం రామయ్య(80) కు తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధడు పెద్ద పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్లో వీడియోలు తీయడంతో ఈ ఘటన వైరల్ గా మారింది. ఇలాంటి వ్యక్తిని కౌన్సిలింగ్ ఇవ్వాలని, అదే ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏమిటని అంటున్నారు గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Latest news