బిజెపిపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

-

బిజెపి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు. వైసిపి – బిజెపి మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసని అన్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు అచ్చేన్నాయుడు. అప్పులు, ఎఫ్ఆర్బిఎం విషయంలో ఏ రాష్ట్రానికి లేని వెసులుబాట్లు ఏపీకే వస్తున్నాయన్నారు. అది జగన్ అదృష్టమని వ్యాఖ్యానించారు అచ్చెన్న . ఏప్రిల్ నెలలో ఏపీకి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే ఇచ్చేలా చేశారని అన్నారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. ఇక బిజెపిపై పితాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ అర్థమైంది అన్నారు. అందుకే చంద్రబాబును ఎవరు విమర్శించినా ప్రజలు చీ కొడుతున్నారని చెప్పారు. భవనపాడు పోర్టుకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇప్పుడు శంకుస్థాపన చేస్తారా..? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని.. వెంటిలేటర్ పైనుండే శంకుస్థాపన చేస్తామంటే ఎవరు నమ్ముతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news