వికారాబాద్ జిల్లాలో దారుణం.. పెళ్లి పేరుతో యువతిని బలవంతం చేసిన ఆర్మీ జవాన్

-

వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళి చేసుకుంటానని యువతి పై పలుమార్లు బలవంతం చేశాడు ఓ ఆర్మీ జవాన్. దాదాపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ… ఐనాపూర్ కు చెందిన మమత మధ్య ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్ళి చేసుకుంటానని యువతిని నమ్మించాడు జవాన్.

సెలవులపై వచ్చి వారం రోజులుగా బయటకు తీసుకెళ్ళి తనను బలాత్కరించాడంటుంది యువతి. నిన్న రాత్రి యువతిని బలాత్కరిస్తుడంగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. పెళ్ళి చేసుకుంటానని రాత్రి తప్పించుకొని….ఉదయం మాట మార్చాడు జవాన్. దీంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువతి. జవాన్ బంధువు కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కేసు తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని యువతి ఆరోపిస్తోంది. పోలీసుల వల్ల తమకు న్యాయం జరిగేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది యువతి.

Read more RELATED
Recommended to you

Latest news