ప్రేమజంటపై దాడి..ప్రియుడి ముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

-

ఉత్తరప్రదేశ్ లొ 20 రోజుల క్రితం ఓ దారుణమైన సంఘటన జరిగింది.ఓ యువతి మరో యువకుడు మాట్లాడుకునేందుకు ఓ ప్రదేశంలో కలుసుకున్నారు.అయితే అదే ప్రాంతానికి చెందిన నలుగురు కిరాతకులు ప్రేమ జంటను చూసి పట్టుకున్నారు.ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మొదలుపెట్టి యువతి పక్కన ఉన్న కుర్రాన్ని కొట్టారు.బెల్టుతో చావబాదారు.అంతటితో ఆగకుండా కుర్రాడి వెంట వచ్చిన యువతిని నలుగురు వ్యక్తులు బలవంతంగా అత్యాచారం చేశారు.నిర్మానుష్య ప్రదేశం కావడంతో యువతిని బెదిరించి బలత్కారం చేస్తుంటే అందులో ఒకడు వీడియో తీశాడు.యువతి ప్రియున్ని కొడుతున్న దృశ్యాలు రికార్డు చేశారు.

అయితే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ ఘడ్ జిల్లాలో లో జరిగింది.యువకుడిని కొట్టి యువతిని అత్యాచారం చేయడంతో..బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.తనకు జరిగిన అన్యాయంపై కడాయి పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేసింది.కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం తో విపరీతంగా వైరల్ అయింది.దీంతో పోలీసులు ఎప్పటికప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు.మొదట దాడి చేసినట్లు కేసు పెట్టిన పోలీసులు తర్వాత అత్యాచారం, మరికొన్ని సెక్షన్లు చేర్చారు.నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news