భైరి నరేష్ పై మళ్లీ దాడి..ఆర్ ప్రవీణ్ సీరియస్

-

నాస్తికుడు బైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై హిందువులు దాడికి తెగబడ్డారు. పోలీస్ వెహికిల్ ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ను కిందకు లాగి దేహశుద్ధి చేశారు.

గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్.. జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేశారు. అయితే, తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ సంఘటనపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు.

KCR పాలనలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. పోలీసుల సమక్షంలోనే భైరి నరేష్ పై పట్టపగలే హత్యాయత్నం జరగడం దేనికి సంకేతం? ఇతని ప్రాణాలకు హాని ఉన్నట్టు పోలీసులకు తెల్వదా? నరేష్ పై మతోన్మాద గూండాల దాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news