వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి.. జస్ట్ లో మిస్ !

-

వైసీపీలో కీలక నేతగా ఉన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడికి యత్నించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ నందిగం సురేష్ పై అతని నివాసం వద్ద తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు అనే వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఎంపీ సురేశ్ ఉద్ధండరాయునిపాలెంలోని తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా పూర్ణచంద్రరావు ఆయన వాహనానికి బైక్ అడ్డుపెట్టి తిట్టడం మొదలుపెట్టాడు.

Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం

వెంటనే రాడ్ తో దాడి చేయబోయిన పూర్ణ చంద్రరావుని, ఎంపీ వెంటే ఉన్న గన్ మెన్ లు అడ్డుకోవడంతో పూర్ణ చంద్ర రావు పారిపోయాడు. దీంతో అతడిని వెంటాడి పట్టుకుని తుళ్ళూరు పోలీసులకు అప్పగించారు ఎంపీ గన్మెన్లు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి యత్నించిన పూర్ణచంద్రరావు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news