బ్రేకింగ్ : పెడన మునిసిపల్‌ కమీషనర్ మీద పారిశుధ్య కార్మికుల దాడి

-

పెడన మునిసిపాలిటీలో ఉద్రిక్థత చోటు చేసుకుంది. పెడన మునిసిపల్‌ కమీషనర్  ఎం.అంజయ్య పై దాడి జరిగింది. ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులు దాడి చేసినట్టు సమాచారం. లంకేశ్వరి అనే వర్కరును వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అంజయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు ఆయన మీద దాడి చేశారు.

అనంతరం పెడన పోలీసులకు పెడన మునిసిపల్ ఎం.అంజయ్యపై పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. అయితే తనపై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని, వాకింగ్ కు వెళుతున్న తనపై ఉద్దేశ పూర్వకంగా దాడి చేశారని కమీషనర్ అంజయ్య చెబుతున్నారు. అలానే తన మీద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న లైంగిక ఆరోపణనలని అంజయ్య ఖండిస్తున్నారు. ఇక ఫిర్యాదు అందిన నేపధ్యంలో జరిగిన వివాదాలపై పెడన పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news