ఏపీలో దారుణం : పూజారుల మీద చెర్నాకోలుతో దాడి !

-

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రం లో దారుణం జరిగింది. ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అతని అనుచరులతో కలిసి వచ్చి గుడిలో టికెట్ల విషయం పై పూజారులు చక్రపాణి శర్మ,సుధాకర్ శర్మ,మురుగుపాణి శర్మ లపై చర్నాకోలుతో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కార్తీక మాసం సందర్భంగా నిన్న అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసారు.

attack
attack

సాయంత్రం నుంచి భక్తులకు ఉచిత దర్శనానికి అవకాశం కల్పించాలని ఆలయ పూజారులు క్లర్క్ ‌నాగరాజు దృష్టికి తీసుకెళ్ళారు.ఈ విషయం క్లర్క్ ‌కు పూజారులకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన విషయం తెలుసుకున్న చైర్మన్ పిట్టం ప్రతాప్ రెడ్డి అతని సోదరుడి తో పాటు మరికొంత మంది గర్భాలయంలో పూజలు నిర్వహిస్తుండగా చర్నాకోలుతో దాడి చేసినట్లు ముగ్గురు పూజారులు చెబుతున్నారు.తీవ్ర గాయాలపాలైన ఆలయ పూజారులు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి పై ఆలయ ఈఓ మోహన్ కు ఫిర్యాదు చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news