Breaking : రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడి..

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌య‌నాడ్‌లో ఆయ‌న త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. శుక్రవారం నాడు.. వయనాడ్‌లో రాహుల్‌గాంధీకి చెందిన కార్యాల‌యంపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి దిగారు. శుక్ర‌వారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు మూకుమ్మ‌డిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాల‌యంలోని సామాగ్రి ధ్వంసం అయ్యింది. ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Rahul Gandhi Enforcement Directorate Questioning: Rahul Gandhi Questioned  For 12 Hours On Day 5

ఈ దాడికి చెందిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా… కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వ‌మే ఈ దాడికి బాధ్య‌త వ‌హించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేర‌ళ పోలీసుల క‌ళ్లెదుటే దుండ‌గులు దాడికి దిగార‌ని కేర‌ళ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వెర‌సి ఈ దాడి వెనుక సీపీఎం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదిలా ఉంటే… ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్ప‌డ్డ వారిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news