స్టేజ్‌ మెట్లపై నుంచి సింగర్​ సోనూ నిగమ్​ను తోసేసిన MLA కుమారుడు

-

సింగర్‌ సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న సోనూపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ సోనూను వెంటనే ఆయన బాడీగార్డ్స్​ చెంబూరులోని ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

ముంబయిలోని చెంబూర్​లో సోనూ నిగమ్‌ ఆయన బృందంతో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్‌కు హాజరైన కొందరు సోనూతో సెల్ఫీకి ప్రయత్నించారు. దీనికి సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. సోనూను, ఆయన స్నేహితులను స్టేజ్‌ మెట్లపై నుంచి కిందకు తోసేయడంతో వారికి గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూపై దాడి ఘటనలో ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిపై కేసు నమోదు చేశారు.

సోనూ నిగమ్‌కు హిందీతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్, సౌత్ ఇలా అన్ని భాషల్లో సోనూ పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులో జీన్స్, గోపాల గోపాల వంటి పలు సినిమాల్లో పాటలు పాడారు.

Read more RELATED
Recommended to you

Latest news