కరోనా వచ్చిందని వృద్దుడిపై దాడి…!

-

మన దేశంలో కరోనా వచ్చిన వారి విషయంలో ప్రవర్తిస్తున్న తీరు నిజంగా ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళు ఏదో పాపం చేసిన విధంగా వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నారు. నానా రకాల బాధలు పెడుతున్నారు కరోనా సోకిన వారిని. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కరోనా వచ్చింది అని ఒక వృద్దుడి పై దాడి చేసారు. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

corona
corona

కరోనా సోకిందని వృద్ధుడుపై దాడి చేసారు. గాయాలతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు సదరు వృద్దుడు. ఇక అతనిపై దాడి చేసిన అందరిని క్వారంటైన్ కి తరలించి వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక వృద్దుడు కుటుంబ సభ్యులను అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news