ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. ఒకరిపై సామూహిక లైంగికదాడి!

-

మధ్యప్రదేశలో దారుణం చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఇద్దరు యువ ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి ఫ్రెండ్స్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి వారిదగ్గర ఉన్న డబ్బులు, నగలను దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎంహౌ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ట్రైనీ అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి చోటీజామ్‌లోని ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు. అక్కడ వారిని అకస్మాత్తుగా 8 మంది దుండగులు చుట్టుముట్టారు. వారి చేతుల్లోతుపాకులు, కత్తులు, కర్రలు ఉన్నాయి.

అనంతరం ఆ గుంపులోని ఒక దుండగుడు ఒక అధికారి, ఒక మహిళను బంధీగా తీసుకున్నారు. మిగతా ఇద్దరిని రూ.10 లక్షలు తీసుకురావాలని పంపించారు.దీంతో భయపడిపోయిన ట్రైనీ అధికారి వెంటనే తమ యూనిట్‌కు వచ్చి కమాండింగ్ అధికారికి ఈ విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనా స్థలానికి వస్తుండటం గమనించిన నిందితులు బంధీగా తీసుకున్న ఆర్మీ అధికారి, మహిళను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన నలుగురిని ఎంహౌ సివిల్ ఆస్పత్రికి తరలిచంగా..ఇద్దరికీ గాయాలైనట్టు తేలింది.అలాగే, దుండగులు బంధీగా ఉన్న మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news