టీం ఇండియాకు ఫినిషర్ దొరికేసాడు: ఆసిస్ కోచ్

-

టీం ఇండియా, వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ సంచలనం. ఆల్‌రౌండర్ 22 బంతుల్లో 42 నాటౌట్‌ గా నిలిచాడు. అతని ఆట కారణంగానే టీం ఇండియా ఆరు వికెట్లతో విజయం సాధించింది. దీనిపై ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ స్పందించాడు.

టీం ఇండియాకు ధోనీ దొరికాడు అని, గతంలో ధోనీ కూడా ఇదే విధంగా ఆడే వాడు అంటూ అతను చెప్పుకొచ్చాడు. అతని ఆట తీరు తాను ఇప్పటికి నమ్మలేకుండా ఉన్నా అని చెప్పాడు. అత్యుత్తమ ఆటగాళ్ళతో ఇండియా నిన్న మ్యాచ్ ఆడింది అని అతను కొనియాడాడు. శిఖర్ ధావన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news