హేమంత్ జగన్ కి వీరాభిమాని.. ఆయన సాయం చేయాలి !

-

హైదరాబాద్ లో ప్రేమ పెళ్లి చేసుకుని అమ్మాయి తల్లి తండ్రుల చేతిలో హత్యకు గురయిన హేమంత్ కేసులో కీలక అంశాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఈ ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. హేమంత్, అవంతిలకు పరిచయం ఏర్పడకముందే ఈ ఇద్దరి తల్లులు ఒకరికొకరు బాగా పరిచయం అని అంటున్నారు. హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్ కావడంతో ఆమె వద్ద అవంతి తల్లి అర్చన బ్యూటీషియన్ సేవలు పొందినట్టు తెలుస్తోంది.

అవంతి ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్ గా వెళ్లేది. ఈ క్రమంలో హేమంత్ తల్లితో అవంతి బాగా దగ్గరైంది. ఆమె కోసం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు హేమంత్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మర్దర్ కేసులో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది. గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. ఇక ఈ అంశం మీద అవంతి మాట్లాడుతూ తన భర్త హేమంత్‌ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అని ఈ కేసులో తనకు న్యాయం జరిగేలా ఆయన సాయం చేయాలని కోరారు. ఇక హేమంత్ ముందు కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news