కేసులు తగ్గినా శవాల దిబ్బలే… భారీ మరణాలు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసులకు సంబంధించి ఇప్పుడు కొత్త విషయం ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలో నిన్న ఒక్క రోజే అత్యధికంగా 4,529 కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 32,26,719 గా ఉన్నాయి. దేశంలో మొత్తం కేసులు 2,54,96,330 గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 3,89,851 డిశ్చార్జయ్యారు అని ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్ర (1,291) లో గరిష్ట ప్రాణనష్టం సంభవించింది. గత 24 గంటల్లో 20 లక్షలకు పైగా పరిక్షలు నిర్వహించారు. క్రియాశీల కేసులు 1.27 లక్షలకు పైగా తగ్గాయి. 13.12 లక్షల మందికి బుధవారం టీకాలు వేశారు. ఐదు రాష్ట్రాలలో 54.05 శాతం కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news