మన ‘లోకం’ అభిప్రాయం : బాబు గారి పెన్నులో ఇంకు మొత్తం డ్రైనేజీ పాలు !!

-

బీసీల రిజర్వేషన్ అంశం గురించి ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. జగన్ సార్వత్రిక సంస్థల ఎన్నికలలో బీసీలకు గతంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రతాపరెడ్డి అనే అతను పిటిషన్ వేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్ లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ….ఇచ్చిన తీర్పును జతచేసి మరియు పిటిషన్ వేయడం జరిగింది. దీంతో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. Image result for chandrababu writingబీసీలకు అంత రిజర్వేషన్ ఎవరు కల్పించామన్నారు అంటూ నిలదీయడంతో..వెంటనే ప్రభుత్వం, గత ప్రభుత్వాలు సార్వత్రిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించడం జరిగిందో అదే ఫాలో అవ్వడానికి రెడీ అయ్యింది. ఇటువంటి తరుణంలో బీసీల రిజర్వేషన్ గురించి లెటర్ లో బాబు గారు పెన్నులో ఇంకు అయిపోయినట్టు జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.

 

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ ను సవాలు చేస్తూ వేసిన పిటిషనర్ ప్రతాపరెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు అని మీడియాలో, సోషల్ మీడియా వార్తలతో పాటు దిగిన ఫోటోలు కూడా బయట పడటం జరిగింది. ఈ పరిణామంతో బీసీల రిజర్వేషన్ అంశంలో బాబు గారు పెన్నులో ఇంకు డ్రైనేజీ పాలయింది. మొత్తం బాగోతం అంతా బయటపడటంతో బీసీల ద్రోహిగా చంద్రబాబుని అభివర్ణిస్తున్నారు బీసీల నాయకులు. 

Read more RELATED
Recommended to you

Latest news