హుజురాబాద్‌ ఉప ఎన్నికపై బాబుమోహన్‌ సంచలన వ్యాఖ్యలు

-

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో బాబు మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ మాదిరి తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరకీ పది లక్షలు ఇవ్వాలని బాబుమోహన్ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్ళించబోమని అసెంబ్లీలో ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని ఫైర్‌ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలోని అందరకీ ఇస్తేనే దళితులపై కేసీఆర్ కు నిజమైన ప్రేమ ఉన్నట్లు అని…దళిత బంధు కాదు‌… దళితుల బతుకులు బంద్ చేయటమే కేసీఆర్ టార్గెట్ అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు చనిపోయి ఉప ఎన్నిక వస్తే తప్ప నియోజకవర్గాలు అభివృద్ధి చెందని పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని ఆగ్రహించారు. బిక్షం కాదు.. మాకు మాడెకరాల భూమి ఇస్తేనే న్యాయం జరుగుతుందని… ఏడేళ్ళ కాలంలో ఎస్సీ‌, ఎస్టీలకు కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే దళిత బంధు పథకం తీసుకువచ్చారని ఆరోపించారు. దళితులకు బిస్కెట్లు వేయటం‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగదని… ఏడేళ్ళ తర్వాత కేసీఆర్ కు దళితులపై ప్రేమ కల్గినందుకు సంతోషం అని తెలిపారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలవటం ఖాయమని తేలిపోయిందని… టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం న్యాయం, దర్మానికి వేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news