ధనాధన్ లీగ్: కైల్ మేయర్స్ వీరవిహారం… 20 బంతుల్లో అర్థ సెంచరీ !

-

గత రాత్రి చెన్నై మరియు లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్ లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోసారి రుతురాజ్ గైక్వాడ్ 57 రాణించడంతో కష్టసాధ్యమైన లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచింది. అనంతరం చేదన స్టార్ట్ చేసిన లక్నో కు ఓపెనర్లు రాహుల్ మరియు మేయర్స్ లు దిమ్మ తిరిగే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 79 పరుగులు చేశారు. ఇందులో కైల్ మేయర్స్ ఒక్కడే 22 బంతుల్లో 53 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 8 ఫోర్లు మరియు 2 సిక్సులూ ఉన్నాయి. చెన్నై బౌలర్లు మేయర్స్ వీరవిహరానికి కొట్టుకుపోయారు. పవర్ ప్లే లో లక్నో ఆడిన తీరు చూస్తే సులభంగా గెలిచేలా కనిపించింది. కానీ ఆ తర్వాత మోయిన్ అలీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడంతో లక్నో 12 పరుగుల దూరంలో ఆగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news