బాహుబలి కోసం నిర్మాతలు అన్ని కోట్లు అప్పులు చేశారా ? ?

-

కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన జక్కన్న మూవీ బాహుబలి. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ లాంటి కీలక నటీనటులు నటించి సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ సినిమా వెనుక దాగున్న ఒక రహస్యం గురించి ఒక ఇంటర్వ్యూలో రానా బయటపెట్టాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా సినిమా సక్సెస్ గురించి చెబుతూ మధ్యలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా అంటూ వారు ఎదుర్కొన్న ఆర్థికపరమైన ఒత్తిడిని వివరించారు. ఈయన చెప్పిన ప్రకారం ఈ సినిమా కోసం నిర్మాతలు వారి ఆస్తులను సైతం తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి అప్పును తీసుకుని నిర్మాణాన్ని పూర్తి చేశారట. కాగా వీరు తీసుకున్న మొత్తం అప్పుడు రూ. 180 కోట్లుగా తెలుస్తోంది. ఈ అప్పు కూడా 24 శాతం వడ్డీకి తీసుకున్నారట.

ఇది విన్న ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా అందించిన లాభాల ద్వారా అంతకు మించి ఆస్తులను కొన్నారు అది వేరే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news