మరో సారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య

-

నందమూరి బాలకృష్ట మరో సారి తన సేవా దృక్పదం చూపిం చుకున్నాడు. తన నియోజకవర్గానికి చెందిన ఒక టీడీపీ నేత చనిపోవడంతో ఆయన కుటుంబానికి బాలయ్య అండగా నిలిచారు. ఏ కష్టం వచ్చినా అందుకోవడానికి ముందుంటానన్న ఆయన అధైర్యపడవద్దని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. మొన్న రోడ్డు ప్రమాదంలో అనంతపురంలోని కోడూరు ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు నరసింహప్ప మృతి చెందారు.

Balakrishna
Balakrishna

అయితే ఆయన కుటుంబ ఆరోగ్య పరిస్థితి అంతనత మాత్రమే అని తెలుసుకున్న బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం మృతుడి కుమార్తె పేరిట రూ.1.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అంతే కాక ఆ కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించి మరీ మనో ధైర్యాన్ని అందించారు. బాలకృష్ణ ఆ కుటుంబంతో ఫోన్లో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించు కోవాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు తాను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి నిన్నటి నుండి వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news