రికార్డు స్థాయిలో బాలాపూర్ ల‌డ్డూవేలం…ఏకంగా రూ. 18.90 లక్షలు !

-

బాలాపూర్‌ లడ్డూ వేలం పాట కాసేపటి క్రితమే ముగిసింది. అయితే… ఈ బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయి ధరకు అమ్మకం జరిగింది. బాలాపూర్‌ లడ్డూ ను ఈ సారి కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ మరియు మర్రి శశాంక్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు.

ఏకంగా రూ. 18.90 లక్షల ధర పలికింది బాలాపూర్‌ లడ్డూ. ఇక బాలాపూర్‌ లడ్డు గెలుచుకున్న అనంతరం.. రమేష్‌ యాదవ్‌ మీడియా తో మాట్లాడారు. బాలాపూర్‌ లడ్డు ను  గెలుచు కోవడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.  ఇవాళ గెలుచుకున్న బాలాపూర్‌ లడ్డు ను ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి గిఫ్ట్‌ గా ఇస్తానని స్పష్టం చేశారు రమేష్‌ యాదవ్‌. 2019 వేలం కంటే లక్షా 30 వేల రూపాయలు ఈ సారి ఎక్కువ ధర పలికింది బాలాపూర్‌ లడ్డూ. ఇక లడ్డూ వేలం పాట అనంతరం..  బాలాపూర్‌ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news