ఇండియా కరోనా అప్డేట్.. కొత్తగా 30,773 కేసులు

-

ఇండియాను కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇవాళ మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,773 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,48,163 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య3,32,158 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.09 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 309 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,44,838 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38,945 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 80,43,72,331 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 85,42,732 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,26,71,167 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news