ఆ ఊరి ప్రజలకు శుభవార్త తెలిపిన బాలయ్య..!

-

నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన ఒక వైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలలో కూడా దూసుకుపోతూ మరింత చెలరేగుతున్నారు. అంతేకాదు ఇంకొక వైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులను , సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలను రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.

వీర సింహారెడ్డి పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య.. జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బాలయ్య సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో భాగంగా అనంతపూర్ జిల్లాలోని రెడ్డిపల్లి తో పాటు మరికొన్ని గ్రామాలలో సినిమా షూటింగ్ చిత్రీకరణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్లె ప్రాంతాలలోని ప్రజలు బాలయ్యను చూసి తెగ సంబర పడిపోయారు.. దీంతో బాలయ్యకు మరింతగా అభిమానులు పెరిగిపోయారని చెప్పవచ్చు ..ఇప్పుడు ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని మరొక గ్రామంలో చిత్రీకరించడానికి సిద్ధమయ్యారు బాలయ్య.

అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న NBK 108 సినిమా ఈనెల 8వ తేదీన తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి లో షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ విషయం తెలిసి ఆ ఊరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో చూసే బాలయ్యను నేరుగా చూస్తామంటూ సంబరపడిపోతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించే బాలయ్య ఇలా పల్లె ప్రాంతాలలో కూడా తన సినిమా చిత్రీకరణ చేస్తూ ప్రజలకు కూడా మరింత దగ్గరవుతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈయనకు సినిమాల పరంగా, రాజకీయపరంగా బాగా కలిసొచ్చేటట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news