అఖండి సినిమా విజ‌యంపై బాల‌య్య ఎమోష‌న‌ల్

-

సింహాచలంలో సింహాద్రి అప్పన్నని ఇవాళ‌ దర్శించుకున్నారు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, అఖండ టీం. ఈ సంద‌ర్భంగా అఖండ సినిమా విజ‌యంపై హీరో బాలకృష్ణ ఎమోష‌నల్ అయ్యారు. అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశామ‌న్నారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చామని వెల్ల‌డించారు.

సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారని… ఘన విజయం అందించారన్నారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు బాల‌య్య‌. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయమ‌ని వెల్ల‌డించారు. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిందని.. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని వెల్ల‌డించారు. సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు బాల‌య్య‌. కాగా.. డిసెంబ‌ర్ 2 వ తేదీన అఖండ సినిమా విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌ల అయిన రోజు నుంచి అఖండి సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది అఖండి సినిమా.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news