మంత్రి పదవి రాకపోవడంపై బాలినేని సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా వేస్తా !

-

మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయని.. దాన్ని ఆరోజే ఖండించానని పేర్కొన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మాపై ఇలాంటివి‌ రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని.. సీఎం జగన్ ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారని వెల్లడించారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదని.. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశామన్నారు. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందని.. అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పారు.

నేను వైయస్సార్ ఫ్యామిలీ అని.. ఆదిమూలపు సురేష్ కి ఇస్తే నేను అలిగానని కూడా రాశారని ఫైర్ అయ్యారు. సురేష్, నేను కలిసి ఆ క్యాబినెట్ లో పనిచేసామని.. ఇద్దరం వేర్వేరు శాఖలు నిర్వహించామన్నారు. పార్టీలో అతను ఎప్పుడూ అనవసరంగా జోక్యం చేసుకోలేదని.. ఇద్దరం కలిసి పార్టీ అభివృద్ధికి పని చేస్తామని స్పష్టం చేశారు.

మావాళ్లు కొందరు రాజీనామా లు చేసినా, అవన్నీ వెనక్కి తీసుకుంటామని.. సీఎం ఎలాంటి బాధ్యతలు బాప్పగించినా నెరవేర్చుతానని ప్రకటన చేశారు. సీఎం 23న ఒంగోలులో ఒక సమావేశానికి వస్తున్నారు.. దాని గురించి చర్చించామన్నారు. కొత్త క్యాబినెట్ లో అందరూ సత్తా ఉన్నవాళ్లేనని.. బీసీ, ఎస్సిలకు‌ ప్రయారిటీ ఇచ్చారన్నారు. పార్టీ కుటుంబం లాంటిది.. అందరం కలిసి మెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news