పాతబస్తీని స్వాధీనం చేసుకుంటాం… కొత్త బస్తీ చేస్తాగా మారుస్తాం – బండి సంజయ్‌

-

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా టార్గెట్ పాతబస్తీ…ఎం ఐ ఎం ఆనవాళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. అబద్దాలు… మోసాల్లో… కేసీఆర్ ను మించిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్‌ అయ్యారు. ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్మేసిండు….ఇగ వేల ఎకరాల్లో జూ, ఫోర్త్ సిటీ, హెల్త్ హబ్ ఏర్పాటు ఎట్లా సాధ్యం ? అని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని… బీఆర్ఎస్ రాక్షస పాలనలో జరిగిన అరాచకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ జోడీ అన్నారు. బీఆర్ఎస్ రాక్షస పార్టీ… ఆ పార్టీతో విలీనం కాదు కదా.. పొత్తు ప్రసక్తే లేదని సెటైర్లు పేల్చారు. ప్రతి ఇంటికి వెళ్లండి…. బీజేపీ సభ్యత్వమివ్వండి… స్థానిక ఎన్నికల్లో గెలవాలనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశమన్నారు. సగటున 200కు మించి సభ్యత్వమిచ్చే పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news