బండి సంజయ్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రేపే !

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటీషన్ పై రేపు హనుమకొండ కోర్ట్ తుది తీర్పును ఇవ్వనుంది. ఈ తీర్పుకోసం బండి సంజయ్ కన్నా ఎక్కువగా పోలీసులు మరియు కేసీఆర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా టెన్త్ పరీక్ష పత్రం లీక్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో కోర్ట్ కెళ్ళి బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్ పై పోలీసులు బెయిల్ కు వ్యతిరేకంగా పిటీషన్ ను… బండి విచారణకు సహకరించడం లేదు మరియు మొబైల్ ఫోన్ ను ఇవ్వడం లేదన్న కారణాలు చూపారు.

ఆ విచారణను వాయిదాలు వేస్తూ వచ్చి ఈ రోజుతో ఈ బెయిల్ రద్దుపై విచారణలు పూర్తి అయ్యాయి. ఇక తీర్పు ఇవ్వడమే మిగిలింది, ఈ తీర్పును రేపు హనుమకొండ మెజిస్ట్రేట్ చెప్పనున్నారు. మరి ఈ తీర్పు ఎవరికీ అనుకూలంగా ఉంటుంది అన్నది చెప్పలేము.

Read more RELATED
Recommended to you

Latest news