కేటీఆర్‌ మరో స్కామ్‌లో దొరికిపోతుండు : బండి సంజయ్‌

-

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు. వేములవాడలో గురువారం నిర్వహించిన సెస్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దొరికిపోయారన్నారు. ఆయన కుమారుడు (కేటీఆర్‌ను ఉద్దేశించి) మరో స్కామ్‌లో దొరికిపోతున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టుకు ఇప్పుడు వెంట్రుకలు తీసుకోమంటున్నారని.. విదేశాల్లో ట్రీట్‌మెంట్‌ తీసుకొని వచ్చి ఇప్పుడు టెస్టుకు సిద్ధమంటున్నారని మండిపడ్డారు. డ్రగ్స్‌ కేసుల్లో మంత్రి కేటీఆర్‌ దోస్తులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరులో డ్రగ్స్‌ కేసులను దర్యాప్తు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news