జీవో 317 స‌వ‌రించాల‌ని నేడు బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష

-

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంపీ బండి సంజ‌య్ పావులు క‌దుపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై న‌జ‌ర్ పెడుతున్నారు. ఇప్ప‌టికే నిరుద్యోగుల కోసం ఎంపీ బండి సంజ‌య్ దీక్ష చేశారు. తాజా గా ఉద్యోగుల స‌మ‌స్య జాగ‌ర‌ణ దీక్ష చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఉద్యోగుల బ‌దిలీకి సంబంధించిన జీవో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తు ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష చేయ‌నున్నారు.

క‌రీంన‌గ‌ర్ లోని ఎంపీ కార్యాల‌యం ఎదురు గా ఈ దీక్ష ఉంటుంది. ఈ రోజు రాత్రి 9 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 3 ఉదయం 5 గంట‌ల వ‌ర‌కు బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంద‌ని.. వాటిని మానుకోవాల‌ని బండి సంజ‌య్ దీక్ష చేస్తున్నారు. బ‌దిలీల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న శైలీ ని వ్య‌తిరేకిస్తు ఈ దీక్ష ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగుల బ‌దిలీల కోసం తెచ్చిన జీవో నెంబ‌ర్ 317 ను వెంట‌నే స‌వ‌రించాల‌ని డిమాండ్ తో ఈ దీక్ష ఉండ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news