ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం చేయాల్సిందే..కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమ‌ని… ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణీకంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 3 ఏళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమ‌న్నారు. తీరా గడువు ముగిసే సమయానికి హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులను మరింత గందరగోళంలో పడేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆగ్ర‌హించారు.

ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయ నిపుణులతో చర్చించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మరింత ఇబ్బందిపెట్టేలా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు అని.. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని.. నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news