పీఆర్సీ ఇస్తామంటే మేము వ్యతిరేకించం..బండి సంజయ్ కీలక ప్రకటన !

-

రెండు ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఓడి పోతున్నామని తెలిసే ఓటర్ ని సీఎం రిక్వెస్ట్ చేయలేదని అన్నారు. అహంకారంతో వ్యవహరించే సీఎం కి ఎందుకు ఓటు వేయాలి ? అని ఆయన ప్రశ్నించారు. ఓడిపోతున్నామని తెలిసి ఉద్యోగ సంఘాలతో మాట్లాడారని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ పై ఎన్నికల కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదు…పీఆర్సీ ఇస్తామంటే మేము వ్యతిరేకించం… అనుమతి ఇవ్వాలని ఈసీ కి విజ్ఞప్తి చేస్తామని అన్నారు.

నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. ? ప్రతి దానికీ మోడీ ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల్లో కూడా కుల సంఘాల తో అసోసియేషన్ లతో లేఖలు తీసుకున్నారు ఏమయింది.. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని అన్నారు. పని చేసేది బీజేపీ నేనని మీరు కేంద్రానికి రాస్తున్న లేఖలను బట్టి స్పష్టం అవుతుంది… మరి ప్రశ్నిస్తున్న మీకు ఎందుకు వోట్లు ఎందుకు వేయాలి ? అని అయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news