హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి లేడు..డిపాజిట్ గల్లంతే : బండి సంజయ్

-

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి లేడు..అక్కడ డిపాజిట్ గల్లంతేనని పేర్కొన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టిన టీఆర్ఎస్ గెలవబోదని.. వాళ్ళ పార్టీ నేతలను వాళ్లే కొనుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. సీఎం కేసీఆర్ అరాచక, మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సంఘటితం అవుతున్నారని మండిపడ్డారు.

నిజాం కాలంలో హత్యలు, మానబంగాలు ఎలా జరిగాయో కేసీఆర్ పాలనలో అలానే జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. నిజాంను స్ఫూర్తి గా తీసుకొని కేసీఆర్ పాలన అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గడిలా పాలనను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ అని.. ఎన్నికలు వస్తే హామీలు… తరవాత కెసిఆర్ ఫార్మ్ హౌస్ లోకి పోయి పడుకుంటాడని ఫైర్ అయ్యారు.

కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ఒక మోసమని… నోరు తెరిస్తే అబద్ధాలు అని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తాడని.. తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంట్ ని మరోసారి రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ పొగ పెట్టడం వల్లనే.. కేసీఆర్ గడీలు దాటి బయటకు వస్తున్నాడని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news