కర్నాటక ఎన్నికల్లో 13 మంది మంత్రుల ఘోర ఓటమి..

-

ఈ రోజు కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకుల మీద షాకులు తగిలాయి. ఈ ఫలితాలలో బీజేపీ కేవలం 64 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇక అధికారంలోకి రానున్న కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించి 136 సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో సెన్సషనల్ రిజల్ట్స్ ఏమిటంటే రాష్ట్ర మంత్రులుగా చేసిన 13 మంది ఘోరంగా ఓడిపోయారు. ఇక పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేకంగా వచ్చి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బెంగుళూరు సిటీ లో ప్రచారం చేసినా.. అక్కడ తన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు.

అక్కడ ఉన్న 18 నియోజకవర్గాలలో కేవలం నలుగురు బీజేపీ అభ్యర్థులు మాత్రమే విజయాన్ని సాధించారు. మొత్తం 14 మందికి బెంగుళూరు ప్రజలు ఉద్వాసన పలికారు. వీరిలో స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కూడా ఓటమి పాలయ్యారు. ఇది నిజంగా బీజేపీకి మింగుడుపడని విషయంగా చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news