చిత‌క్కొట్టిన బెంగ‌ళూరు.. ముంబై టార్గెట్ 202..

-

దుబాయ్ లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చిత‌క్కొట్టింది. మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 201 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

bangalore made 201 runs against mumbai in ipl 2020 10th match

బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ల‌లో ఏబీ డివిలియ‌ర్స్ (55 ప‌రుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఫించ్ (52 ప‌రుగులు, 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు అద్భుతంగా రాణించారు. అలాగే చివ‌ర్లో వ‌చ్చిన శివం దూబె 10 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్స‌ర్ల‌తో 27 ప‌రుగులు చేశాడు. దీంతో బెంగ‌ళూరు భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, చాహ‌ర్ 1 వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news