దారుణం : ఆస్తి గొడవల్లో ఏడాది బాబు దారుణ హత్య

-

మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో తమకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఏడాది వయసున్న పసి బాలుని చంపిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయం పేట మండలం డీ ధర్మారం గ్రామంలో రామాయం పేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తి మొదటిభార్య భారతమ్మ 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. మొదటి భార్యకు నవీన్ అనే 19 సంవత్సరాల కుమారుడు మరో కుమార్తె ఉంది.

మొదటి భార్య చనిపోయిన అనంతరం పోచయ్య ఎల్లవ్వ అనే మహిళ తో రెండో వివాహం చేసుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఎల్లవ్వ వేణు అనే బాబుకు జన్మనిచ్చింది. ఇది నచ్చని మొదటిభార్య కుమారుడు నవీన్ ఏడాది వయసున్న వేణును చంపుతానని తరచూ బెదిరించేవాడు. ఈ విషయంలో తండ్రి పోచయ్య కుమారుడు నవీన్ కు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అదే కోపంలో ఏడాది వయసున్న వేణు గొంతు నులిమీ నవీన్ చంపి పారిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వేణు మృతి చెండాడు. నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. రామయంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news