స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారిపై ఎఫెక్ట్..!

-

మీరు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుని వాడుతూ వుంటారా..? అయితే మీరు దీని గురించి తెలుసుకోవాలి. తాజాగా ఎస్‌బీఐ కార్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కీలక నిర్ణయం వలన కస్టమర్స్ కి ఈ సమస్యలు వస్తాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఎస్బీఐ కార్డు కొత్తగా చార్జీలు వసూలు చేయనుంది. దీనితో వచ్చే నెల నుండి ఈ చార్జెస్ ని చెల్లించుకోవాలి. ఇది నిజంగా కస్టమర్స్ కి కష్టంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనుంది.

అదే విధంగా ట్రాన్సాక్షన్లను ఈఎంఐ లోకి మార్చుకున్నా కూడా ఈ చార్జెస్ పే చెయ్యాలి. అలానే డిసెంబర్ 1 నుంచి ఈ చార్జీల విధింపు అమలు లోకి వస్తుందని ఎస్బీఐ కార్డు తెలిపింది. ఇక కొత్త చార్జెస్ ఎలా ఉన్నాయనేది చూస్తే..

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారు డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్ల లో, అలాగే రిటైల్ స్టోర్ల లో నిర్వహించే ఈఎంఐ లావాదేవీలకు చార్జెస్ పడతాయి. ఇతర పన్నులు అదనం.

Read more RELATED
Recommended to you

Latest news