భార్య వేధిస్తుందని భర్త సూసైడ్… సెల్ఫీలో వీడియోలో వెల్లడి.

-

మంచి ఉద్యోగం.. సాఫీగా సాగుతున్నజీవితం..కానీ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తన వేధనను చెప్పుకుని బలవన్మరం చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..షేక్‌పేట్‌కు చెందిన సంతోష్‌(36) నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్‌(6) కొడుకు ఉన్నాడు.

అయితే గత కొంత కాలంగా కుమారుడు అభిరామ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో గత కొంత కాలం నుంచి సంతోష్ ను భార్య కళ్యాణి వేధిస్తోంది. వేధింపులు తాళలేక సంతోష్ ఆత్మహ్యత చేసుకున్నాడు. ఆన్ లైన్ లో పురుగుల మందు ఆర్డర్ చేసుకుని. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్ లో మందు కలుపుకుని తాగాడు పరిస్థితిని గమనించి ఆస్పత్రికి తరలించినా.. బతకలేదు. ఆదివారం రాత్రి బాధితుడు మరణించాడు. అంతకముందు సంతోష్ సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి నే కారణం అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్‌ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్‌, బాబాయి భీమ్‌ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news