ఉచితంగా రూ.2 లక్షల బెనిఫిట్ అందిస్తున్న ఈ బ్యాంక్..!

-

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. దీనితో కస్టమర్స్ ఎన్నో లాభాలు పొందొచ్చు. మీకు కూడా స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ లో వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ తన కస్టమర్లకు రూ.2 లక్షల వరకు ఉచిత బెనిఫిట్ కల్పిస్తోంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ లాభం ఉంటుంది. అలాగే ఈ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూపే డెబిట్ కార్డులను ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడు మీకు రెండు లక్షలు లాభం వస్తుంది. 2018 ఆగస్ట్ 28కి ముందు లేదా తర్వాత ఎప్పుడు జన్ ధన్ ఖాతా ఎప్పుడు ఓపెన్ చేసారు అనే దాని మీద ఆధార పడి ఉంటుంది.

ఆగస్ట్ 28కి ముందు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేస్తే రూ.లక్ష వరకు ఉచిత ప్రమాద బీమా వస్తుంది. అదే 2018 ఆగస్ట్ 28 తర్వాత జన్ ధన్ ఖాతా తెరిచి ఉంటే అప్పుడు వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.

బ్యాంక్ అకౌంట్ లేని వారు సులభంగానే అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. ఎస్‌బీఐకి వెళ్లి కూడా జన్ ధన్ ఖాతా తెరవొచ్చు. కేవైసీ వివరాలు అందిస్తే సరిపోతుంది. జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు.

ఈ కార్డు ద్వారానే ప్రమాద బీమా లభిస్తుంది. అందుకే ఈ డెబిట్ కార్డను ఉపయోగిస్తూ ఉండాలి. లేదు అంటే ప్రమాద బీమా లభించదు. ప్రమాదం జరగడానికి 90 రోజుల ముందు కనీసం ఒక్కసారైన కార్డు ద్వారా ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news