WORLD CUP :ఆ మ్యాచ్ లకు దూరం కానున్న సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా !

-

మరో వారం రోజుల్లో ఇండియా లో వరల్డ్ కప్ మొదలు కానుంది, ఇందులో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దాదాపుగా అన్ని జట్లు ఇప్పటికే ఇండియా చేరుకొని ప్రాక్టీస్ ను శురూ చేశాయి. ఇక సౌత్ ఆఫ్రికా జట్టు సైతం ఇండియా చేరుకొని వార్మ్ అప్ మ్యాచ్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కెప్టెన్ బావుమా అర్జెంటు గా స్వదేశానికి పయనమయ్యి వెళ్లారు. పూర్తి వివరాలను చూస్తే… ఏవో వ్యక్తిగత కారణాల వలన బావుమా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. వార్మ్ అప్ మ్యాచ్ లలో భాగంగా సౌత్ ఆఫ్రికా సెప్టెంబర్ 29న ఆఫ్గనిస్తాన్ తో మరియు అక్టోబర్ 2వ తేదీన న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక బావుమా ఈ రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడంతో మార్ క్రామ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.

ఇక మెయిన్ మ్యాచ్ లకు బావుమా ఇండియాకు రానున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ తెలిపింది. కాగా సౌత్ ఆఫ్రికా తన మొదటి మ్యాచ్ ను అక్టోబర్ 7వ తేదీన ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news